బ్రేకింగ్; ఉస్మానియాలో మావోయిస్ట్ లు, పోలీసులకు పక్కా ఆధారాలు…!

-

భారతదేశ ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా భావించే ఉస్మానియాలో అసలు ఎం జరుగుతుంది…? ఇప్పుడు పోలీసులకు కూడా అంతుబట్టడం లేదు. గత కొన్ని రోజులుగా వర్సిటీలో మావోలు సంచరిస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై పెద్దగా సీరియస్ గా వ్యవహరించని తెలంగాణా పోలీసులు ఇప్పుడు మాత్ర౦ కొన్ని ఆధారాలతో దృష్టి పెట్టినట్టు సమాచారం.

తెలంగాణాలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొన్ని రాజకీయ శక్తుల ప్రోద్బలంతో కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వర్సిటీలో పావులు కదుపుతున్నారని విద్యార్ధులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. అడువుల నుంచి బయటకు వచ్చిన కొంత మంది అన్నలు విధ్యార్ధులతో వర్సిటీలో సమావేశమైనట్టు పోలీసులు గుర్తించారు. ఇక అప్పటి నుంచి వర్సిటీలో ఉన్న మావోయిస్ట్ సానుభూతి పరుల విషయంలో,

ఒక కన్నేసి ఉంచిన పోలీసులు తాజాగా ప్రొఫెసర్ ఖాసీం ని అదుపులోకి తీసుకున్నారు. వర్సిటిలో ఉన్న అతని ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు కంప్యూటర్ సహా విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. మారు వేషాల్లో వస్తున్న మావోయిస్టులు… ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులను రెచ్చగొడుతున్నారనీ, లేనిపోని రాజకీయ అలజడులు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకు కాశీం సహకరిస్తున్నారని పోలీసులు అంటున్నారు.

ఎలాంటి సమాచారం లేకుండా ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. దాదాపు 5 గంటల పాటూ తనిఖీలు కొనసాగాయి. కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు, రెండు బ్యాగుల విప్లవ సాహిత్యం, పాంప్లెట్లను గజ్వేల్ పోలీసులు ఆయన ఇంట్లో స్వాధీనం చేసుకుని సీజ్ చేసారు. దీనితో కొంత మంది విద్యార్ధులు ఆందోళన చేయడంతో వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. దీనితో వర్సిటిలో ఎం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది

Read more RELATED
Recommended to you

Latest news