బీజేపీ బేచో ఇండియా అంటోంది మేము సోచో ఇండియా అంటున్నాం: కేటిఆర్ ఫైర్

-

బీజేపీ బేచో ఇండియా అంటోంది తాము సోచో ఇండియా అంటున్నామని మంత్రి కేటిఆర్ అన్నారు. బీజేపీ నేతలు గోబెల్స్ కు కజిన్ బ్రదర్స్ లాగా అబద్దాలు చెబుతున్నారని ఆయన కాసేపటి క్రితం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపణలు చేసారు. కేంద్ర మంత్రులు ఆబద్దాలు ఆడుతున్నారు అని, ప్రకాష్ జవదేకర్ వచ్చి అసత్యాలు చెప్పారని ఆయన మండిపడ్డారు. టిఆర్ఎస్, ఎంఐఎం ప్రభుత్వ వైఫల్యం అనడానికి జవదేకర్ కు ఇంకిత జ్ఞానం ఉండాలి అని ఆయన దుయ్యబట్టారు.

మాకు ఎవరూ భాగస్వాములు కాదని ఆయన స్పష్టం చేసారు. పీడీపీ వంటి వేర్పాటు వాదులతో మీకు భాగస్వామ్యం ఉంది అని విమర్శించారు. టిఆర్ఎస్, ప్రభుత్వ వైఫలం అనడమే పెద్ద తప్పని ఆయన స్పష్టం చేసారు. మా మీద ఎందుకు ఛార్జిషీట్ వేయాలి అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బీజేపీ కి 50 ప్రశ్నలు సంధించిన కేటీఆర్… కేంద్రమంత్రులే తెలంగాణ నంబర్ వన్ అంటుంటే ఛార్జి షీట్ వేయడానికి సిగ్గుండాలి అన్నారు

Read more RELATED
Recommended to you

Latest news