అండమాన్ జైలుకు చంద్ర‌బాబు.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ లక్ష్మీపార్వతి

-

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తన భర్త ఎన్టీఆర్ బ్రతికున్న రోజుల్లో చంద్రబాబుపై ఎలాంటి వ్యాఖ్యలు చేసేవారో లక్ష్మీ పార్వతి ప్రస్తావించారు. ‘మాజీ సీఎం ఎన్టీఆర్‌ చనిపోయిన రోజుల్లో చంద్రబాబు పట్ల తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసేవారు. మళ్లీ తాను అధికారంలోకి వస్తే.. చంద్రబాబును తప్పకుండా అండమాన్‌ జైలుకు పంపించాలని ఉందని తనతో అన్నట్లు లక్ష్మీ పార్వతి గుర్తు చేసుకున్నారు’.

ఏపీలో టీడీపీ గత పాలనపై విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన సిట్ ద్వారా అన్ని వాస్తవాలు బయటకొస్తాయని ఆశిస్తున్నానని అన్నారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, సుజనా చౌదరి.. ఈ ముగ్గురూ జైలుకు వెళ్లడం చూడాలని ఉందని చెప్పారు. అంతేకాకుండా, ప్రాచీన తెలుగు భాషకు పూర్వ వైభవం తీసుకొస్తామని లక్ష్మీపార్వతి చెప్పారు. తెలుగు సాహిత్య పీఠాన్ని విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. తెలుగు అకాడమీ ద్వారా ‘తెలుగు’ భాషాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పిన లక్ష్మీపార్వతి, ‘తెలుగు’తో పాటు ’ఇంగ్లీషు‘కు కూడా సీఎం జగన్ ప్రాధాన్యమిస్తున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news