మహామేత.. యువమేత.. సీఎం జ‌గ‌న్‌పై నారా లోకేష్‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!

-

చంద్రబాబు ఐదేళ్ల పాలనలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ… నిజాలను వెలికి తీసేందుకు వైసీపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ ట్విట‌ర్ వేదిక‌గా విమర్శలు గుప్పించారు. ఈ క్ర‌మంలోనే ‘మహామేత’, ‘యువనేత’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “మహామేత` అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిపై, 26 పైగా విచారణలు, 14 సభా సంఘాలు, 4 న్యాయ విచారణలు, 3 మంత్రివర్గ ఉప సంఘాలు, నలుగురు అధికారులతో విచారణలు, 1 సీబీసీఐడీ విచారణ చేయించారు. ఏమైంది? అని ప్ర‌శ్నించారు.

అలాగే 9 నెలలుగా, మంత్రుల స‌బ్ క‌మిటీలు, అధికారుల కమిటీలు, విజిలెన్స్ విచారణ, సీఐడీ విచారణ, ఐటీకి, ఈడీకి ఉత్తరాలు రాసి విచారణ చెయ్యమన్నారు. ఏమైంది?’ అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు కొత్తగా సిట్ అంటున్నారని… అది కూడా బాబాయ్ మర్డర్లు లాంటి కేసులను విచారణ చేయాల్సిన అధికారులతోనని లోకేశ్ విమర్శించారు. ఇక్కడ యువమేత ఆత్రం అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. సాధించేది ఏమీ లేనప్పుడు… సిట్ లతో కాలక్షేపం చేయడమే అవుతుందని అన్నారు. ఈమేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు. దీనికి తోడు గతంలో పత్రికల్లో వచ్చిన వార్తలను కూడా నారా లోకేష్ షేర్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news