ఈ 8 నెలల్లోనే పరాజితుడిగా మిగిలిపోయాడు: జ‌గ‌న్‌పై నారా లోకేష్ ట్విట్‌

-

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ఎప్ప‌టిక‌ప్పుడు విరుచుకుప‌డుతున్న టీడీపీ నేత నారా లోకేష్ మ‌రో సారి ట్విట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శ‌లు గుప్పించారు. నేడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలనా తీరుపై నారా లోకేశ్ మండిప‌డ్డారు. పాలనలో అన్ని రకాలుగా జగన్ వైఫల్యం చెందారని విమర్శించారు. జగన్ గెలిచి 8 నెలలు అవుతోందని… ఇప్పటికే ఆయన ఒక పరాజితుడిగా పేరు తెచ్చుకున్నారని అన్నారు. జగన్ నుంచి ఎవరూ ఇంతకు మించి ఏమీ ఆశించలేరని చెప్పారు.

ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. దీంతోపాటు, అమరావతి విషయంలో ఏపీ ప్రభుత్వం సెల్ఫ్ గోల్ చేసుకుందంటూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో వచ్చిన కథనాన్ని షేర్ లోకేశ్ షేర్ చేశారు. రాజధాని అమరాతి ఆగిపోవడంతో పాటు రాష్ట్ర భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైన నేపథ్యంలో… హైదరాబాద్ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కబోతోందని ఇండియన్ ఎక్స్ ప్రెస్ అభిప్రాయపడింది అంటూ ట్విట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news