మరో మూడు జిల్లాలను టార్గెట్ చేసిన నిమ్మగడ్డ… షెడ్యూల్ ఇదే

-

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వరుస పర్యటనలు చేస్తున్నారు. రాయలసీమ జిల్లాల తర్వాత ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల మీద ఆయన ఫోకస్ పెట్టారు. ఫిబ్రవరి 3, 4 తేదీల్లో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం గుంటూరు జిల్లాల్లోఎస్ ఈసీ పర్యటన ఉంటుందని ఎన్నికల కమీషన్ ప్రకటన చేసింది. ఫిబ్రవరి 3 న సాయంత్రం 4.25 గంటలకు విజయవాడ నుంచి తిరుపతి బయల్దేరి వెళ్తారు.

ఫిబ్రవరి 3 న సాయంత్రం 6.45 గంటలకు చిత్తూరు కలెక్టర్, ఎస్పీ సహా జిల్లా అధికారులతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 4 ఉదయం 8 గంటలకు తిరుపతి నుంచి నెల్లూరు వెళ్లనున్న ఎస్ ఈసీ… ఫిబ్రవరి 4 న ఉదయం 10 గంటలకు నెల్లూరు జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. ఫిబ్రవరి 4 న మధ్యాహ్నం12 గంటలకు నెల్లూరు నుంచి ఒంగోలు వెళ్తారు.

ఫిబ్రవరి 4 న మధ్యాహ్నం 2 గంటలకు ప్రకాశం జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా ఉన్నతాధికారులతో ఎస్ఈసీ సమీక్ష చేస్తారని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 4 న సాయంత్రం 4 గంటలకు ఒంగోలు నుంచి గుంటూరు వెళ్లి… ఫిబ్రవరి 4 న సాయంత్రం 6 గంటలకు గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ ఉన్నతాధికారులతో సమీక్ష చేయనున్నారు. ఫిబ్రవరి 4 న రాత్రి 9.30 గంటలకు తిరిగి ఆయన విజయవాడ వస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news