కన్న తల్లి చనిపోయినా సరే…!

-

పోలీసులు చేస్తున్న సేవ టీడీపీ ఎమెల్యే అనగాని సత్యప్రసాద్ కొనియాడారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజల ధన,మాన, ప్రాణాలకు కాపలా కాస్తూ అరాచక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలు జరిపే వ్యక్తులతో యుద్ధం చేస్తూ ప్రాణాలు విడిచిన పోలీస్ అమర వీరులకు జోహార్లు అంటూ ఆయన వ్యాక్యాలు చేసారు . కరోనా సమయంలో కూడా విది నిర్వహణకు కట్టుబడి తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించి కొంతమంది పోలీసులు అమరులయ్యారు అని అన్నారు.

వారందరి త్యాగాలను స్మరిస్తూ పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా నివాళి అర్పిస్తున్నాం అని చెప్పారు. పోలీసులు ప్రజల కోసమే తమ జీవితం అంకితం చేసి కుటుంబానికి దూరంగా 24 గంటల పాటు విధుల్లోనే ఉంటూ సమాజానికి రక్షణగా నిలుస్తున్నారు అని అన్నారు. ఈ క్రమంలో కన్నతల్లి, సోదరుడు మరణించినా.. కడచూపునకు వెళ్లకుండా విధుల్లోనే ఉన్నారు. వారికి సెల్యూట్ అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news