ఐఏఎస్ లకు జీతాలివ్వకపోవడం సిగ్గుచేటు: పవన్ కళ్యాణ్

-

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని ఓడించాలని జనసేన, టీడీపీ లు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే ఇక టీడీపీ మరియు జనసేనలు తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నాడు. ఇందుకోసం ఎన్డీయే కూటమి నుండి బయటకు రావడానికి కూడా వెనుకాడడం లేదు. కాగా తాజాగా మీడియా ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రభుత్వం గురించి కొన్ని విమర్శలు చేశాడు. ఈయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని నడిపించే ఐఏఎస్ అధికారులకు నెల నెలా జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదని తెలిపాడు. ఇది నిజంగా రాష్ట్రానికి సిగ్గు చేటన్నారు పవన్ కళ్యాణ్. ఐఏఎస్ మరియు ఐపీఎస్ అధికారులకు ఇవ్వాల్సిన జీతాలను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఏకరువు పెట్టారు, 20వ తేదీ వచ్చినా జీతాలు అందడం లేదు..

ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా అంటూ పవన్ ప్రశ్నించాడు. ఇటువంటి దారుణమైన ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వైసీపీని ఓడించి ఇంటికి పంపించాలి అంటూ పవన్ కళ్యాణ్ గొంతెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news