రాష్ట్రపతి పర్యటనలో జగన్… ఫైనల్ అయిన షెడ్యూల్

-

కరోనా వైరస్ వ్యాక్సిన్ కి సంబంధించి రాష్ట్రాల సిఎంలతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశాలు నిర్వహిస్తున్న నేపధ్యంలో సిఎం వైఎస్ జగన్… రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ తిరుపతి పర్యటనలో పాల్గొంటారా లేదా అనే దానిపై అనేక అనుమానాలు ఉన్నాయి. అయితే వాటిని ఏపీ ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేశాయి. ఉదయం 9.45 కు గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి రేణిగుంట ఎయిర్పోర్ట్ చేరుకోనున్న సీఎం… రాష్ట్రపతి పర్యటనలో పాల్గొంటారు.

ram nath kovind orders to home ministries for telangana inter students suicide report

10.30 కు రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్ కు రేణిగుంట ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలకిన తర్వాత ఆయన తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు కోవిడ్ 19 పై ప్రధాని ఆధ్వర్యంలో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆర్థిక శాఖపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహిస్తారని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈ సమావేశానికి ఆర్ధిక శాఖా మంత్రి హాజరు అవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news