నానీ కేబినేట్ లో ఉంటే పరువు పోవడం ఖాయం

-

ఏటూకూరు బైపాస్ రోడ్డు లోని ఆంజనేయులు స్వామి ఆలయం లో బిజేపి – జనసేన పూజలు నిర్వహించాయి. కోడాలి నానీ కి మంచి బుద్ది ప్రసాదించాలని దేవుడికి పూజలు చేసారు. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. హిందూ దేవాలయాలపై కోడాలి నాని వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఆయన అన్నారు. నానీ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.

కోడాలి నానీ లాంటి వ్యక్తులు క్యాబినెట్ లో ఉంటే మీ పార్టీ పరువు పోతుందని రావేల కిషోర్ బాబు అన్నారు. తక్షణమే కోడాలి నానీ ని మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసారు. బిజేపి – జనసేన ఆధ్వర్యంలో హిందూ రక్షణ కోసం పోరాటం చేస్తాం అని స్పష్టం చేసారు. కాగా నిన్న సాయంత్రం హిందు దేవుల్లపై మంత్రి కొడాలి నానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news