అది కచ్చితంగా కుట్రే: రేవంత్

-

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం పై ప్రధానికి రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేసారు. సీబీఐ తో పాటు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీతో శాఖాపరమైన విచారణకు అదేశించాలని మోడీని రేవంత్ కోరారు. ఈ సంఘటనలో క్రిమినల్ కోణం ఉంది అని ఆయన ఆరోపణలు చేసారు. వందల కోట్ల నష్టం వాటిల్లిందని, ఇక్కడ ప్రమాదం జరగడం వల్ల కొందరికి లాభం జరుగుతుందని అన్నారు.

సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు వస్తాయని రేవంత్ అభిప్రాయపడ్డారు. అనుభవం లేని రిటైర్డ్ అయిన ప్రభాకర్ రావు ను ఎండీ గా ఉండడం వల్ల జెన్కో ట్రాన్స్కో సంస్థలు నష్టాల్లో కూరుకపోయాయని విమర్శలు చేసారు. ప్రభాకర్ హయాంలో ఇచ్చిన టెండర్లు, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరపాలని, శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో ప్రమాదం వల్ల బయట ప్రైవేట్ వ్యక్తులకు లాభం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. బయట ఎవరిదగ్గర నుంచి విద్యుత్ కొంటున్నారో ప్రజలకు చెప్పాలని సవాల్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news