బాలకృష్ణకు షాక్ ఇచ్చిన నియోజకవర్గ ప్రజలు, గొ బ్యాంక్ అంటూ నినాదాలు…!

-

ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు హిందూపురం ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. హిందూపురం పర్యటనకు వెళ్ళగా ఆయన మూడు రాజధానుల సెగ తగిలింది. వివరాల్లోకి వెళితే గురువారం బాలకృష్ణ నియోజకవర్గంలో పర్యటనకు వెళ్ళారు. ఈ సందర్భ౦గా అక్కడికి భారీగా చేరుకున్న ప్రజలు మూడు రాజధానులను వ్యతిరేకించిన నందమూరి బాలకృష్ణ రాయలసీమ ద్రోహి అంటూ విమర్శలు చేస్తూ ఆయన్ను అడ్డుకున్నారు.

రాయలసీమ ద్రోహి గొ బ్యాక్ అంటూ ఆయనకు నిరసన తెలిపారు. ఆయనకు వ్యతిరేకంగా వైసీపీ నాయకులు గొ బ్యాక్ అంటూ నినాదాలు చేసారు. దీనితో తెలుగుదేశం కార్యకర్తలు బాలకృష్ణ కు మద్దతుగా నిలిచారు. ఆయన కాన్వాయ్ వద్దకు భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. ఆయన కాన్వాయ్ కి అడ్డుగా వైసీపీ కార్యకర్తలు బైటాయించి నిరసన తెలిపారు. దీనితో భారీగా అక్కడికి చేరుకున్న పోలీసులు, వారిని తొలగించారు.

దీనితో ఒక్కసారిగా బాలకృష్ణ షాక్ అయ్యారు. ఆయన కారులో నుంచి దిగకముందే నిరసన రావడంతో దిగలేదు. దీనితో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మొహరించారు.కాగా తెలుగుదేశం పార్టీ మూడు రాజదానులకు వ్యతిరేకంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల శాసన సభలో ఆమోదించిన వికేంద్రీకరణ బిల్లుని శాసన మండలిలో అడ్డుకుని సెలెక్ట్ కమిటికి పంపామ్తో వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news