జోడో యాత్రలో ఆసక్తికర ఘటన.. రాహుల్ ని పట్టుకుని ఏడ్చేసిన బాలిక

-

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ యాత్రలో ప్రజలు రాహుల్ కు నీరాజనం పలుకుతున్నారు. పలు ప్రాంతాల ప్రజలు రాహుల్ పై తమ ప్రేమను చాటుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. ఈ యాత్రలో ఇప్పటికే పలు ఉద్విగ్న సన్నివేశాలు చోటుచేసుకున్నాయి.

జోడో యాత్ర 18వ రోజున ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రాహుల్‌ను కలిసిన ఓ పాఠశాల విద్యార్థిని సంభ్రమాశ్చర్యాలకు లోనై.. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది. ఆమె చేయిపట్టుకొని రాహుల్ ముందుకు సాగుతుండగా పట్టరాని సంతోషంతో గెంతులేస్తూ ఏడ్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ‘భారత్‌ జోడో’ ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసిన కాంగ్రెస్‌.. ‘ఎలాంటి క్యాప్షన్‌ అవసరం లేదు కేవలం ప్రేమ’ అంటూ పేర్కొంది. ఈ వీడియోను ఇప్పటికే దాదాపు 3లక్షల మంది వీక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news