ఏపీ అసెంబ్లీలో టీడీపీ నేతల సస్పెన్షన్

-

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుండి తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కరోజు పాటు సస్పెండ్ అయ్యారు.నిత్యావసర సరుకుల ధరలపై తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే ఈ తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టుగా అసెంబ్లీ ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఈ అంశంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టి స్పీకర్ పోడియం వద్ద నిలబడి నిరసన వ్యక్తం చేశారు.స్పీకర్ పోడియం వద్ద నిలబడి నినాదాలు చేస్తుండగా అదే సమయంలో సంతాప తీర్మానాలను కూడ ప్రవేశ పెట్టారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు స్పీకర్ తమ్మినేని సీతారాం అనుమతి ఇచ్చారు.

సంతాప తీర్మానాలపై వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్ బాబు, అబ్బయ్య చౌదరిలు ప్రసంగించారు. అయితే అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు పేపర్లు చింపి స్పీకర్ వైపునకు విసిరివేశారు.టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమయంలో శాసనసభలో గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో అసెంబ్లీని టీ బ్రేక్ కోసం స్పీకర్ వాయిదా వేశారు.టీ బ్రేక్ తర్వాత అసెంబ్లీ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడ టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని నిరసనకు దిగారు.

సభ నిర్వహణకు సహకరించాలని పదే పదే స్పీకర్ చెప్తున్నా లెక్కచేయని టీడీపీ సభ్యులు ఈలలు వేస్తూ అధికార పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈలలు వేయవద్దని స్పీకర్ టీడీపీ సభ్యులను వారించారు. సభా సంప్రదాయాలను ఉల్లంఘిస్తున్నారని స్పీకర్ టీడీపీ సభ్యుల దృష్టికి తీసుకు వచ్చారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గిస్తున్నారని అధికార పార్టీ టీడీపీ సభ్యుల సస్పెన్షన్ కు తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో సభ నుండి టీడీపీ ఎమ్మెల్యేలను ఒక్కరోజు సస్పెండ్ చేస్తున్నట్టుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news