త‌డ‌బ‌డ్డ ఈట‌ల రాజేంద‌ర్.. ఆడేసుకుంటున్న టీఆర్ఎస్ నేత‌లు!

-

ఎన్నోఉద్య‌మాలు, మీటింగులు, పెద్ద పెద్ద స‌భ‌ల్లో మాట్లాడిన అనుభ‌వం ఆయ‌న‌కుంది. ఒక్క‌సారి కూడా త‌డ‌బ‌డ‌కుండా మాట్లాడిన చ‌రిత్ర ఆయ‌న సొంతం. పెద్ద లీడ‌ర్ల‌కు కూడా త‌న మాట‌ల తోనే కౌంట‌ర్ వేసిన చాక‌చక్యం ఉన్న నిఖార్సైన ఉద్య‌మ నేత‌గా పేరున్న ఈట‌ల రాజేంద‌ర్ తొలిసారి త‌డ‌బ‌డ్డాడు. అది కూడా ఏకంగా పార్టీ గుర్తుపైనే ఇలా జ‌రిగింది.

 

నిన్న హుజూరాబాద్‌లో జ‌రిగిన ప‌దాధికారుల మీటింగ్‌కు బండి సంజ‌య్‌, ఇత‌ర క‌మ‌ల‌నాథులు హాజ‌ర‌య్యారు. అయితే బండి సంజ‌య్ త‌ర్వాత మాట్లాడిన ఈట‌ల రాజేంద‌ర్ హుజూరాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండా అంటూ త‌డ‌బ‌డ్డాడు. ఆ వెంట‌నే నాలుక క‌ర‌చుకుని స‌రిచేసుకున్నారు.

అయితే ఈ వీడియో చూసిన గులాబీ నేత‌లు తెగ ట్రోల్ చేస్తున్నారు. హుజూరాబాద్‌లో గెలిచేది టీఆర్ఎస్ అని ఈట‌ల రాజేంద‌రే ఒప్పుకున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. అంతే కాదు త‌మ గెలుపు ఆల్రెడీ డిక్లేర్ అయిపోయిందంటూ ఈట‌ల‌పై మాట‌ల తూటాలే పేల్చుతున్నారు. ఇంకొంద‌రేమో ఈట‌ల ఇంకా బీజేపీలోకి ఇముడ‌లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి రాజేంద్రుడు తొలి సారి త‌డ‌బ‌డ్డాడు

Read more RELATED
Recommended to you

Latest news