ఓటమి భయంతో టీడీపీ క్యాడర్…. కారణం ఇదేనా?

-

ఏపీలో రాజకీయాలు తీవ్ర స్థాయిలో మారిపోతున్నాయి. రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఒకరు ప్రజా శ్రేయస్సు కోసం తపిస్తుంటే.. మరొకరు తెర వెనుక మంత్రాంగం చేస్తున్నారు. ఒకరిది జనంతో మమేక ప్రచారమైతే.. మరొకరిది కార్పొరేట్ ప్రచారంగా మారిపోయింది. ఈ ఇద్దరూ ఎవరంటే ఒకరు సీఎం జగన్ మరొకరు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

వీరిలో వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓటర్లతో మమైకమవుతున్నారు. తమ క్యాడర్‌ కోసం అహర్నిషల్ కృషి చేస్తున్నారు. ఓటర్లతో మమైకమవుతున్నారు. సామాన్యులతో కలిసిపోతూ ఎన్నికల ప్రచార హెరులో ముందుకు పోతున్నారు. జనంతో కలివిడిగా కలిసిపోతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వపు సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. వంద శాతం గెలుపు ధీమాతో ప్రచారాన్ని సాగిస్తున్నారు.

అదే సమయంలో టీడీపీ అధినే నారా చంద్రబాబు నాయుడులో మాత్రం రోజు రోజుకు ఆందోళన ఎక్కువ అవుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఘోర ఓటమి పాలైన టీడీపీకి మరొకసారి ఓటమి భయం వెన్నాడుతోంది. మంగళగిరిలో లోకేష్‌, కుప్పంలో చంద్రబాబు జనంలోకి వెళ్లేదానికంటే ప్రైవేట్‌ మీటింగ్‌లతో సరిపెడుతున్నారు. ఓటర్లను గ్రూపులుగా విభజించడం, డబ్బులతో ఏ రకంగా కొనేయాలన్నదానిపై సమాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం. ఒకటి రెండు సార్లు జనంలోకి వెళ్లినా.. ప్రచారం మాత్రం సప్పగా సాగుతోందని స్థానికులంటున్నారు. కేవలం కార్పోరేట్‌ తరహా సమావేశాలు పెడుతూ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు.

చంద్రబాబు నాయుడు, తన కొడుకుగా రాజకీయాల్లోకి వచ్చిన లోకేష్‌.. ఇప్పటివరకు ఏ ఎన్నికలోనూ గెలిచింది లేదు. గత ఎన్నికల్లో మంగళగిరిలో మంత్రిగా ఉంటూ పోటీ చేసి చిత్తుగా ఓడిపోయాడు లోకేష్‌. రాజకీయంగా ఆయన ఇప్పటికి సాధించిన అద్భుతాలు లేవు. లోకేష్‌ను ఏ రకంగానైనా ప్రమోట్‌ చేయాలన్న తాపత్రయంలో చంద్రబాబు.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేశాడు. అదేంటో గానీ.. జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న తెలుగుదేశం కాస్తా.. లోకేష్‌ సారథ్యంలో కనీసం తెలంగాణలో పోటీ కూడా చేయలేదు. మరే రాష్ట్రంలో పోటీ చేసే సత్తా గానీ, మద్ధతు గానీ లేదు. అయినా తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా చెప్పుకోవడం, దానికి జాతీయ కార్యదర్శిగా లోకేష్‌ను ప్రచారం చేసుకోవడం చంద్రబాబుకే చెల్లింది. ఈసారి బోలెడు అపశకునాల మధ్య మంగళగిరిలో భవిష్యత్తు కోసం లెక్కలేసుకుంటు కాలం గడిపేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news