టీడీపీకి గుడ్‌బై చెప్పిన నలుగురు ఎంపీలు

-

టీడీపీ రాజ్యసభ సభ్యులు నలుగురు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావు పార్టీని వీడుతున్నట్లు లేఖ రాసి దాన్ని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు అందించారు.

వీళ్లు టీడీపీని వీడుతున్నట్టు గత కొన్ని రోజులు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వాటిని నిజం చేస్తూ వాళ్లు ఇవాళ రాజ్యసభ చైర్మన్‌కు లేఖ రాశారు. అయితే.. టీడీపీకి రాజీనామా చేసిన ఈ ఎంపీలు.. ఏ పార్టీలో చేరేది చెప్పనప్పటికీ.. వీళ్లు త్వరలోనే బీజేపీలో చేరుతారని తెలుస్తోంది.

ఇప్పటికే టీడీపీకి భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. మొన్నటి ఎన్నికల్లోనూ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఎమ్మెల్యేలు కూడా 23 మందే గెలిచారు. ఎంపీలు ముగ్గురే గెలిచారు. దీంతో టీడీపీకి ఏపీలో భవిష్యత్తు లేదని..చాలామంది టీడీపీ నేతలు బీజేపీలో చేరడానికి సన్నద్ధం అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news