దుర్గగుడిని పార్టీ ఆఫీస్ గా మార్చేసారు… సరికొత్త వివాదం…!

-

అధికారంలో ఉన్న ఎవరు అయినా సరే కాస్త అప్రమత్తంగా వ్యవహరించాలి. కాని ఏపీలో వైసీపీ నేతలు మాత్రం చిన్న చిన్న విషయాల్లో వివాదాలు తెచ్చుకుని అంతిమంగా పార్టీని ఇబ్బంది పెట్టేయడం ఇప్పుడు కాస్త వివాదం అవుతుంది. దుర్గగుడి పాలనా కార్యాలయంలో వైసీపీ సమావేశం నిర్వహించింది. పార్టీ ర్యాలీల నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. అక్కడి వరకు అలా ఉంటే…

ఆలయ ఖర్చులతో అతిథి మర్యాదలు చేయడం గమనార్హం. దుర్గగుడి చైర్మన్‌ పైలా సోమి నాయుడు అధికార దుర్వినియోగంకు పాల్పడుతున్నారు అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. గతంలోనూ వైసీపీ కార్పొరేటర్‌ అభ్యర్థులతో మంత్రి భేటీ అయ్యారు. మంత్రి వెల్లంపల్లి పట్టించుకోవడంలేదని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆధ్యాత్మికమైన, ప్రతిష్టాత్మక స్థలంలో.. రాజకీయ సమావేశంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news