బాబు ఈ అంకెలు చూడు : విజయసాయి

-

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ రగడ కొనసాగుతుంది. అధికార, ప్రతిపక్ష మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. వరుస అరెస్టుల పర్వంతో వాతావరణం వేడిగా మారింది. అటు మీడియా ముందు, ఇటు సోషల్ మీడియాలో కూడా నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. తన ట్విట్టర్ వేదికగా..  ‘ప్రతి దానికి కులానికి లింకుపెట్టే చంద్రబాబు నాయుడు ఈ అంకెలు చూడు అర్థమవుతుంది. బీసీ, ఎస్‌సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి సీఎం వైఎస్‌ జగన్ గారి‌ ప్రభుత్వం కట్టుబడ్డది. కులాలను రెచ్చగొట్టి, ఆ హింసాగ్నిలో చలి కాచుకునే చరిత్ర చంద్రబాబుదే. బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు 68.18 శాతం, కాపులకు 42.35 శాతం, మైనార్టీలకు 116 శాతం పెంచారు’ అని ఆయన వివరించారు. కాగా, నిన్న అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news