వైరల్; అందమైన కొండల్లో యోగా చేస్తున్న 29 ఏళ్ళ ఎంపీ…!

-

దేశంలో ఉన్న యువ ఎంపీల్లో తేజస్వి సూర్య ఒకరు. కర్ణాటకలోని దక్షిణ బెంగళూరు నుంచి ఎంపీగా ఎన్నికైన ఈ ఎంపీ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఏదోక వివాదాస్పద వ్యాఖ్య చేయడమో లేక ఈయన గురించి ఎవరైనా ఏదైనా అనడమో ఈయన్ను టార్గెట్ చేసి విమర్శలు చేయడమో ఏదొకటి ఈ 29 ఏళ్ళ ఎంపీ గురించి ఏదోక వార్త బయటకు వస్తూనే ఉంటుంది.

సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతూ ఉంటారు. తాజాగా తేజస్వి సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. దీనికి ఆయన కొండ ప్రాంతాల్లో చేసిన యోగానే కారణం. బుధవారం ఉదయం ఆయన తన సోషల్ మీడియాలో ఖాతాలో నాలుగు ఫోటోలు పోస్ట్ చేసారు. ఈ ఫోటోలలో ఆయన ఒక అందమైన కొండ ప్రాంతంలో ఒక పెద్ద బండరాయి మీద ఆసనం వేస్తూ ఉంటారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతూ ఉన్నాయి.

అందరికి గుడ్ మార్నింగ్ అంటూ తేజస్వి పోస్ట్ చేసారు. ఇక ఈ పోస్ట్ పై పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇంత అందమైన ప్రదేశ౦ ఉన్నప్పుడు జిమ్ తో అవసరం ఏంటీ అని కామెంట్ చేయడం విశేషం. మరికొంత మంది అయితే వివిధ ప్రాంతాల్లో తాము యోగా చేస్తున్న ఫోటోలు వీడియోలను కామెంట్ల రూపంలో పోస్ట్ చేస్తున్నారు. మా రోజుని మేము కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం అని కొందరు అంటే, మీ నియోజకవర్గ ప్రజలకు కూడా ఇలాంటి సదుపాయం ఇవ్వండి అని మరికొందరు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news