జూనియర్ ఎన్టీఆర్ నూ.. బాబు వదల్లేదుగా..?

-

సోషల్ మీడియా యుద్ధాలు పెరుగుతున్నాయి. కొన్నిరోజులుగా టీడీపీ- వైసీపీ మధ్య ఈ విషయంలో మాటల యుద్ధం జరుగుతోంది. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల గురించి టీడీపీ కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ సర్కారుపై మండిపడ్డారు. ఓ మూడు గంటల సేపు ప్రెస్ మీట్ కూడా పెట్టారు.

అయితే.. అసలు సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి ఆద్యుడు చంద్రబాబే అంటున్నారు వైసీపీ నేతలు.. పాత విషయాలను గుర్తు చేస్తూ చంద్రబాబుకు కౌంటర్లు ఇస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి గట్టిగా విమర్శలు చేశారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారని చంద్రబాబు గంటల తరబడి మాట్లాడుతున్నారని… కానీ పిల్లనిచ్చిన మామ ఎన్‌టీఆర్‌ను ఎంతగా వేధించారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

గతంలో లక్ష్మీపార్వతిపై మీరు చేసిన అరాచకాలు తెలియవా ? అంటూ గుర్తు చేశారు. అంత ఎందుకు.. చంద్రబాబు చివరకు సోషల్ మీడియాలో జూనియర్‌ ఎన్టీఆర్‌ను కూడా వదల్లేదు.. అంటూ శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. గతంలో వైయస్‌ఆర్‌ కుటుంబంపై సోషల్‌ మీడియాలో ఎలాంటి తప్పుడు ప్రచారం చేశారో ప్రజలకు తెలియదా ? అంటూ పాత విషయాలు గుర్తు చేశారు.

చంద్రబాబును ప్రజలు ఎన్నికల్లో తిరస్కరించినా బుద్ధి రాలేదని గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో టీడీపీ అరాచక పాత్ర పోషిస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్రానికి మద్దతుగా ఉండాల్సిన మీరు.. పరిశ్రమలు వెనక్కి వెళ్తున్నాయని అసత్యాలు చెబుతున్నారు. పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌లను జేబుల్లో పెట్టుకొని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వ్యక్తి చంద్రబాబు. ప్రశాంతంగా ఉన్న పల్నాడు ప్రాంతాన్ని అల్లకొల్లొలం చేసేందుకు ప్రయత్నించారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news