జగన్ ఆపరేషన్ స్టార్ట్: బాబు, లోకేష్, అచ్చెన్న… నెక్స్ట్ మంత్రి ఎవరు?

-

జగన్ ఆపరేషన్ స్టార్ అయ్యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంతకాలం రాజకీయంగా టీడీపీని అణగతొక్కేసే ప్రయత్నం చేసి దాదాపు సక్సెస్ అయిన వైఎస్ జగన్.. తాజాగా వారు చేసిన అవినీతిపై ఎంక్వైరీలు వేసి వారిని పూర్తిగా తొక్కేసే కార్యక్రమానికి తెరతీసారని అంటున్నారు. అవినీతికి ఏమాత్రం తావులేని పాలన అందిస్తానని చెప్పిన జగన్… గత ప్రభుత్వ హాయాంలో జరిగిన అవినీతిపై ఎంక్వైరీలు స్టార్ చేశారు. ఈ క్రమంలో నెక్స్ట్ ఎవరు అనేది తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

ఇప్పటికే ముఖ్యమంత్రి, ఐటీ మంత్రి, కార్మిక శాఖా మంత్రి… ఇలా వరుసగా చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడులను టార్గెట్ చేసిన అనంతరం… నెక్స్ట్ వరుసలో ఎవరు ఉన్నారు అనే విషయంలో ఒకపేరు ప్రముఖంగా వినిపిస్తుందట. విజయవాడకు చెందిన ఆ మంత్రి.. జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించడంతోపాటు, పోలవరం పేరుచెప్పి విపరీతమైన అవినీతికి పాల్పడ్డారని అంటున్నారు. ఆ లెక్కన చూసుకుంటే… ఆ వరుసలో నెక్స్ట్ ఉన్నది దేవినేని ఉమ అనే మాటలు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకూ నిజం అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!

చంద్రన్న కానుకల పేరుచెప్పి చంద్రబాబుని, ఫైబర్ గ్రిడ్ పేరుచెప్పి లోకేష్ ని, ఈఎస్ఐ మందుల పేరుచెప్పి అచ్చెన్నల వెన్నులో వణుకు పుట్టించేపనికి పూనుకున్న జగన్… నెక్స్ట్ కచ్చితంగా పోలవరం పేరుచెప్పి దేవినేని ఉమనే టార్గెట్ చేస్తారని అంటున్నారు. ఈ క్రమంలో… వరుసగా చాలా మంది టీడీపీ మంత్రులు.. చేసిన పనులకు ప్రతిఫలాలు పొందే అవకాశాలున్నాయని అంటున్నారు! జగన్ టార్గెట్ చేయడం ఏమిటి… వారు అవినీతికి పాల్పడ్డారు, ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది అని వైకాపా నేతలు చెబుతున్నారు. నిజమే కదా… నిప్పులేకుండా పొగరాదుగా!

Read more RELATED
Recommended to you

Latest news