సాయిరెడ్డిని బుక్ చేస్తున్న రాజుగారు..సైడ్ చేసేశారా?

-

ఏపీలో వైసీపీ, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుల మధ్య ఎలాంటి వార్ నడుస్తుందో అందరికీ తెలిసిందే. ప్రతిరోజూ ఢిల్లీలో ఉంటూ రఘురామ, వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. ఇలా విమర్శలు చేస్తున్న రఘురామకు చెక్ పెట్టేయాలని వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే ఆయనపై వేటు వేయించడానికి చూశారు..కానీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు. అయితే తానే ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి రాజు గారు రెడీ అయ్యారు.

అయితే ఎంపీ పదవికి రాజీనామా చేసి, మళ్ళీ నరసాపురం బరిలో దిగి సత్తా చాటాలని రఘురామ భావిస్తున్నారు. ఇదే క్రమంలో రాజుగారికి ఎలాగైనా చెక్ పెట్టాలని వైసీపీ చూస్తుంది. ఇప్పటికే ఆయనపై రాజద్రోహం కేసు ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో జైలుకెళ్లి బెయిల్ మీద బయటకొచ్చారు. ఇప్పుడు అదే కేసులో సి‌ఐ‌డి పోలీసులు ఆయనని విచారణకు పిలిచారు. అలాగే ఆయనపై మరో కేసు కూడా నమోదైంది. సి‌ఐ‌డి చీఫ్ సునీల్ కుమార్‌ని దూషించారని చెప్పి, కేసు నమోదైంది. ఇలా కేసు నమోదు కావడంతో…తనని చంపడానికి సి‌ఐ‌డి చీఫ్ ప్లాన్ చేశారని, దీని వెనుక జగన్ కూడా ఉన్నారని, తనకు ప్రాణహాని ఉందని చెప్పి రఘురామ, ప్రధాని మోడీకి లేఖ రాశారు. అలాగే హోమ్ శాఖకు లేఖ రాశారు.

అయితే దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు…రఘురామవి అన్నీ నాటకాలే అన్నట్లు మాట్లాడారు. దీనికి రఘురామ కూడా వెంటనే కౌంటర్ ఇచ్చేశారు. సీఎం చేతుల్లో రోజు తన్నుల తింటున్న ఆ వ్యక్తి కూడా తన రూట్‌లోనే వస్తున్నారని, త్వరలోనే వైసీపీ నుంచి గెంటేయడం గ్యారెంటీ అని మాట్లాడారు.అంటే విజయసాయిని వైసీపీ నుంచి బయటకు పంపే కార్యక్రమాలు జరుగుతున్నాయని రఘురామ పరోక్షంగా చెబుతున్నారు. అయితే ఈ మధ్య వైసీపీలో విజయసాయి హవా తగ్గిందని చెప్పొచ్చు. ఆయన ఎక్కువ కనబడటం లేదు. మరి దీనికి కారణం ఏంటో తెలియాలి.

Read more RELATED
Recommended to you

Latest news