అసెంబ్లీని అనంతపురంలో పెట్టాలంటూ వైసీపీ ఎమ్మెల్యే కొత్త డిమాండ్‌..

-

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండొచ్చేమోనని అసెంబ్లీ వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అమరావతి సహా వైజాగ్, కర్నూల్‌తో కలిపి మూడు రాజధానులను ఏర్పాటు చేయొచ్చని.. ఇందుకు సంబంధించి ప్రస్తుతం కమిటీలు వేసింది ప్రభుత్వం. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు ఏర్పాటు అయితే, అన్ని ప్రాంతాలూ అభివృద్ధి పథంలో దూసుకెళతాయని అభిప్రాయపడ్డ కదిరి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పీవీ సిద్దారెడ్డి, అనంతపురంలో అసెంబ్లీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, ఒక్క అమరావతిని లక్ష కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసే బదులు, మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. ఇక్కడ అసెంబ్లీని పెట్టి, శీతాకాల సమావేశాలు నిర్వహిస్తే బాగుంటుందని సిద్దారెడ్డి అభిప్రాయపడ్డారు. వివిధ శాఖల అధిపతుల కార్యాలయాలను కూడా జిల్లాల స్థాయిలో ఏర్పాటు చేయాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news