ఏపీ విద్యార్థులకు శుభవార్త.. సంక్రాంతి సెలవులు పొడగింపు !

-

ఏపీ విద్యార్థులకు జగన్‌ మోహన్‌ రెడ్డి శుభవార్త అందించనుంది. సంక్రాంతి సెలవులను ఈ నెల చివరి వరకు అంటే జనవరి 30 వరకు పొడగించాలని ఆలోచన చేస్తుంది జగన్‌ సర్కార్‌. ఏపీలో స్కూళ్ల కు సెలవులు పొడిగింపు పై రేపు కీలక నిర్ణయం తీసుకోనుంది ఏపీ సర్కార్‌. విద్యాసంస్థల సెలవుల పొడిగింపు పై ఏపీ విద్యాశాఖ లో రేపు చర్చ జరుగనుంది. ఈ సందర్భంగా సెలవుల పొడిగింపు పై రేపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

ఏపీలో ప్రస్తుతం 13.87 శాతం కరోనా పాజిటివిటీ రేటు నమోదు అవుతోంది. రానున్న 15 రోజుల్లో ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు విద్యాశాఖ కీలక సమావేశం నిర్వహించి.. సెలవుల పెంపు పై నిర్ణయం తీసుకోనుంది. కాగా.. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి సెలవులను పెంచేశారు. ఈ మేరకు ఇవాళ అధికారిక ప్రకటన కూడా చేసింది కేసీఆర్‌ సర్కార్‌. ఇక తెలంగాణ బాటలో ఏపీ కూడా నిర్ణయం తీసుకునే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news