ముంబైలో ఖరీదైన ఫ్లాట్ కొన్న పూజా హెగ్డే

-

పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘రాధే శ్యామ్’ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన పూజ హెగ్డే నటించారు. ఆపై చేసిన బీస్ట్, ఆచార్య కూడా నిరాశ మిగిల్చాయి. ఈ బ్యూటీ బాలీవుడ్ లోనూ నిలదోక్కుకుంది. ఇందుకు కారణం లేకపోలేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని సామెతను ఈమె అక్షరాల అమలుపరచుకుంటుంది. అందులో భాగంగానే ముందుగా ఓ ఇంటిదైపోయింది.

ఇటీవల ముంబైలో ఖరీదైన భవనాన్ని కొనుగోలు చేసింది. దీని గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ, చిన్ననాటి నుంచి తనకు సొంత ఇల్లు కొనుక్కోవాలనే కోరిక ఉండేదని తెలిపింది. ఆ కల ఇప్పటికి నెరవేరింది అని పేర్కొంది. ముంబైలో కొత్త ఇల్లు కొనుక్కొని దాన్ని తనకు కావాల్సిన విధంగా రూపొందించుకున్నానని చెప్పింది. వృత్తిపరంగా మనం ఎలాంటి మానసిక ఉద్రేగాలు గురైన ఇంటికి వస్తే అలాంటివన్నీ మటుమాయం అవుతాయంది. తన ఇంటిని ఆ విధంగా మార్చి అమర్చుకున్నారని చెప్పింది. మనల్ని మనలా ఉండేలా చేసేది సొంత ఇల్లు అని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news