పెళ్లి చేసుకుని వెళ్లిపోతా అనుకున్నారు.. ఎమోషనల్ అయి కన్నీరు పెట్టుకున్న పూనమ్ కౌర్

-

దుర్భర పరిస్థితుల్లో ఉన్న ఏ స్త్రీపైనా కూడా చిన్న చూపు చూసే వాడు రాక్షసుడు అవుతాడని.. కాలం ఏదైనా కథ ఇదే అని అంటూ ఎమోనల్ అయ్యారు సినీ నటి పూనమ్ కౌర్. చాాలా రోజుల తరువాత ‘నాతి చరామి’ అనే సినిమా చేస్తోంది పూనమ్ కౌర్. ఈ సినిమా ప్రెస్ మీట్ సమయంలో ఎమోషనల్ అయి కన్నీరు పెట్టుకున్నారు పూనమ్ కౌర్. 2017-18లో నేను పెళ్లి చేసుకుని వెళ్లిపోతారని అనుకున్నారని.. మా అమ్మకు ఫోన్ చేసి ఈ దేశం వదిలి వెళ్లిపోవాలని అనుకున్నానని ఆమె వెల్లడించారు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఛాలెంజ్ చేయాలని.. ఇది నాకు పర్సనల్ కూడా తెలిసిందని.. తన జీవితాన్ని సినిమాలే మార్చేశాయని పూనమ్ కౌర్ అన్నారు. నేను మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్లలో కూడా నేను చాలా ధైర్యంగా ఎదుర్కున్నానని వెల్లడించారు. 

ప్రత్యేకంగా మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన అమ్మాయిలకు చాలా కలలు ఉంటాయని.. అందులో పెళ్లి ఒకటని ఆమె అన్నారు. మా అమ్మే నన్ను చాలా ధైర్యంగా మార్చిందని అన్నారు. ఎప్పుడూ సినిమాలు చేయనని అనుకుంటున్న సమయంలో.. ఓ స్టోరీ ఉందని మా ఫ్రెండ్ చెప్పారు. నేను ఇక్కడ రాజకీయ పరిస్థితుల వల్ల చెన్నైలో ఉన్న సమయంలో ఈ సినిమా స్టోరీ చెప్పారని అన్నారు. మనం మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినప్పుడు.. సీత, ద్రౌపతి, దుర్గ దేవతల స్టోరీలు నాకు చాలా ప్రేరణగా నిలిచాయని పూనమ్ కౌర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news