ఏపీలో దారుణం.. విదేశీ మహిళపై నెల్లూరు వాసి లైంగిక దాడి

-

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. విదేశీ మహిళపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పపడ్డాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లాలోని సైదాపురంలో లిథుయేనియా దేశానికి చెందిన యువతి పై అత్యాచార యత్నానికి పాల్పడ్డడాడు సాయి కుమార్ అనే యువకుడు.

చెన్నై నుంచి బెంగళూరు మీదుగా గోవాకు బయలు దేరింది లిథుయేనియా దేశానికి చెందిన యువతి. ఈ నేపథ్యంలోనే చెన్నై బసు లో లిథుయేనియా దేశానికి చెందిన యువతికి పరిచయమయ్యాడు సాయి కుమార్. బెంగళూరు నుంచి గోవాకు తీసుకెళతానని.. మాయ మాటలు చెప్పి నెల్లూరు జిల్లా గూడూరుకు ఆ యువతిని తీసుకు వచ్చాడు సాయి కుమార్. ముందస్తు ప్రణాళికతో గూడూరు నుంచి బైక్ లో సైదాపురం కు వెల్లాడు.

అక్కడే గ్రామ శివార్లలోని నిర్జన ప్రదేశంలో లిథుయేనియా దేశానికి చెందిన యువతిపై లైంగిక దాడికి ప్రయత్నం చేశాడు. ముందస్తు సమాచారంతో మిత్రుడిని కూడా రప్పించాడు. కానీ ఆ ఇద్దరినీ తప్పించుకుని రహదారి మీదకు చేరుకుని స్థానికులకు సమాచారం ఇచ్చింది ఆ యువతి. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు రంగంలోకి దిగారు. వారిని అరెస్ట్ చేసి.. కేసు బుక్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news