ఏపీలో షూటింగ్స్‌ చేస్తే..నిర్మాతలకు రాయితీలు ఇస్తాం – పోసాని కృష్ణ మురళి

-

ఏపీలో షూటింగ్స్‌ చేస్తే..నిర్మాతలకు రాయితీలు ఇస్తామని వైసీపీ కీలక నేత పోసాని కృష్ణ మురళి ప్రకటన చేశారు. చలన చిత్ర అభివృద్ధి కోసం త్వరలో సీఎం జగన్‌ తో చర్చలు జరుపబోతున్నాం.. నంది అవార్డ్స్ కోసం కూడా మాట్లాడడం జరుగుతుందని వివరించారు. ఆంధ్రలో సినిమా షూటింగ్స్ చేస్తే నిర్మాతల కు భారం కాకుండా అతి తక్కువగా ఉండేలా చూస్తామన్నారు.

దేశం లో ఎక్కడ కెని విధంగా ఎఫ్ డి సి కి వచ్చి సినిమా తీస్తాను అంటే అన్ని విధాలుగా వాళ్ళకీ సహకరిస్తామని.. నంది అవార్డులు విషయంలో నేను చిన్నప్పటి నుంచి వింటూనే వున్నానని వివరించారు. టెంపర్ లో నాకు నంది వచ్చింది తప్పదు అని నాకు ఇచ్చారు..కానీ దానిని తిరస్కరించానని వెల్లడించారు. ఇక్కడ కమ్మ కాపు డామినేషన్ అంటూ ఏమి లేదు కేవలం డబ్బు మాత్రమే డామినేషన్ చేస్తుంది.. నందులు పంచుకొనే విషయంలో చాలా మంది దర్శక నిర్మాతలు నష్టపోయారన్నారు. నందులు విషయం లో అన్ని విషయాలు చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటన చేశారు పోసాని కృష్ణ మురళి.

Read more RELATED
Recommended to you

Latest news