మంచు విష్ణు గురించి సంచలన కామెంట్స్ చేసిన పోసాని కృష్ణ మురళి..!

-

పోసాని కృష్ణ మురళి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పోసాని కృష్ణ మురళి నటుడిగా, దర్శకుడిగా, హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. పోసాని కృష్ణ మురళి తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన సన్ ఆఫ్ ఇండియా సినిమాలో నటించాడు. ఈ సినిమా ఫిబ్రవరి 28 వ తేదీన విడుదల కాబోతుంది.

సన్ ఆఫ్ ఇండియా సినిమా విడుదల తేది దగ్గర పడటంతో తాజాగా ఈ చిత్ర బృందం భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఏర్పాటు చేసింది. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లో భాగంగా పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ కొన్ని ఆసక్తి కరమైన కామెంట్లు చేశాడు. పోసాని కృష్ణ మురళి సన్ ఆఫ్ ఇండియా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకల్లో భాగంగా మాట్లాడుతూ… ఈ సినిమాలో మోహన్ బాబు నాకు ఒక మంచి పాత్రను ఇచ్చారు.

అన్నయ్య గురించి తెలియని వారు ఇండస్ట్రీ లోనే లేరు. స్వచ్ఛమైన మనసుతో వారు మాట్లాడుతారు అని పోసాని కృష్ణమురళి అన్నారు. ‘మా’ ఎన్నికల్లో ఎవరూ సాధించలేని రీతిలో మంచు విష్ణు విజయం సాధించాడు. అతడు కూడా మామూలు మనిషే, గొప్ప వాడు ఏమి కాదు. మంచి లక్షణాలతో పుట్టిన వాడు కాబట్టే గెలిచాడు అని సన్ ఆఫ్ ఇండియా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లో భాగంగా కృష్ణ మురళి కామెంట్లు చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news