బాలయ్య కోపం 1 నిమిషం మాత్రమే..!

-

అటు సినీ ఇండస్ట్రీలో, ఇటు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపిన నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలపై ప్రముఖ సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి స్పందించారు. ఆవల మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన, అనేక అంశాలపై మాట్లాడారు. ఈ నేపధ్యంలో బాలకృష్ణ వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. బాలకృష్ణ కోపం నిమిషం మాత్రమేనని, ఆయన మాటలను సీరియస్ గా పట్టించుకుని ఎవరూ బాధపడొద్దని హితవు పలికారు. “బాలయ్య కోపం ఒక్క నిమిషమే, బాలయ్య ఆవేశం ఒక్క నిమిషమే, బాలయ్య విమర్శ చేసినా ఒక్క నిమిషమే… వీటివల్ల సమాజంలో ఎవరికీ నష్టంలేదు. నేను కూడా వీటిని తేలిగ్గానే తీసుకుంటాను. అందరూ అలాగే తీసుకోవాలి” అంటూ హితవు పలికారు. బాలకృష్ణ ఎంతో నిజాయతీ ఉన్న వ్యక్తి అని, తండ్రి సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన పలుకుబడిని ఉపయోగించుకోలేదని వెల్లడించారు. బాలయ్య డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news