గ్రేటర్ లో ‘వీరికి’  పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం !

-

వికలాంగులకు, 80 ఏండ్లు పైబడిన వారికి, కోవిడ్ 19 పాజిటివ్ పేషెంట్లకి ఈ సారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించబడిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ కేటగిరీల వారు ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా లేదా నేరుగా పోలింగ్ కేంద్రానికి వచ్చి అయినా ఓటు వేసి వినియోగించుకోవచ్చునని పేర్కొంది. పోలింగ్ కేంద్రంలో వికలాంగులు మరియు వయస్సు పైబడిన వారి సౌకర్యార్థం ర్యాంపులు ఏర్పాటు చేసి, వీల్ చైర్లు ఏర్పాటు చేయాలని ఎన్నికల అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

వీల్ చైర్లు తోయడానికి వాలంటీర్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొంది. వికలాంగులు, వయస్సు పైబడిన వారు, పసి పిల్లల తల్లులు క్యూలైన్ తో సంబంధం లేకుండా నేరుగా ఓటు వేయవచ్చని పేర్కొంది. కోవిడ్ 19 పేషెంట్ లు మాస్క్, ఫేస్ షీల్డ్, గ్లోవ్స్ ధరించి, కోవిడ్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ సాయంత్రం 5.00 గంటల నుండి 6.00 గంటల లోపు ఓటు హక్కు వినియోగించుకోవచ్చునని పేర్కొంది. 

Read more RELATED
Recommended to you

Latest news