ఏయిర్‌పోర్ట్‌లో ప్ర‌భాస్ హ‌ల్‌చ‌ల్‌!

-

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ గురువారం ఏయిర్ పోర్ట్‌లో హ‌ల్‌చ‌ల్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇంర్నెట్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. `సాహో` చిత్రం త‌రువాత ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `రాధేశ్యామ్‌. `జిల్‌` ఫేమ్‌` రాధాకృష్ణ‌కుమార్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. గ‌త ఏడు నెల‌లుగా ఈ మూవీ షూటింగ్ క‌రోనా వైర‌స్ కారణంగా ఆగిపోయింది. తిరిగి షూటింగ్‌ని మొద‌లుపెట్టాల‌ని భావించిన చిత్ర బృందం గురువారం ఇటీలీ బ‌య‌లుదేరింది.

క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న స‌మ‌యంలో ఇటీలీలోని జార్జియాలో కీల‌క ఘ‌ట్టాల‌ని షూట్ చేసింది చిత్ర యూనిట్‌. అయితే అప్ప‌టికే వైర‌స్ స్వైర‌విహారం చేస్తుండ‌టం, లాక్‌డౌన్ అమ‌ల్లోకి రాబోతుండ‌టంతో టీమ్ అంతా హుటా హుటిన తిరిగి ఇండియా వ‌చ్చేసింది. తాజా ల‌న్‌లాక్ ప్ర‌క్రియ మొద‌లై అన్ని రంగాలు తిరిగి యాక్టీవ్ అవుతున్న నేప‌థ్యంలో చిత్ర బృందం బ్యాలెన్స్ షూటింగ్ కోసం గురువారం టీమ్ అంతా ఇటీవ‌ల బ‌య‌లుదేరింది. ఇందు కోసం ఏయిర్ పోర్ట్‌కి వ‌చ్చిన ప్ర‌భాస్‌ శంషాబాద్ ఏయిర్ పోర్ట్‌లో ‌సంద‌డి చేశారు.

1900 కాలం నేప‌థ్యంలో సినిమా సాగ‌నుంది. ఇందు కోసం సిటీ ఔట్ స్కర్ట్స్‌లో సెట్స్ నిర్మించినా 7 నెల‌లు కావ‌డంతో చాలా వ‌ర‌కు పాడైపోయాయ‌ట‌. మ‌ళ్లీ వాటిని పున‌రుద్ధ‌రించి షూట్ చేయ‌డం త‌ల‌కు మించిన భారం అని భావించిన ప్ర‌భాస్ ఇట‌లీలోని రియ‌ల్ లొకేష‌న్‌ల‌లో షూటింగ్ కే ఆస‌క్తి చూపించార‌ట‌. దీంతో టీమ్ గురువారం ఇట‌లీ బ‌య‌లు దేరించి అక్క‌డ కీల‌క ఘ‌ట్టాల‌ని పూర్తి చేసుకుని టీమ్ తిగిరి ఇండియా రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news