మాల్దీవుల్లో ప్రభాస్ – కృతి సనన్ న్యూ ఇయర్ వేడుకలు..!!

-

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లోనే కాకుండా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఇండియన్ సినిమాలో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఈయన కూడా ఒకరు. అందరూ డార్లింగ్ అని ముద్దుగా పిలుచుకుని మురిసిపోతూ ఉంటారు. ఇకపోతే బాహుబలి సినిమా తర్వాత దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన అంటే అమ్మాయిలు పడి చచ్చిపోతారు. అందుకే డార్లింగ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు ? ఎవరిని చేసుకుంటాడు? అనే ప్రశ్నలే ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. గత కొన్నాళ్లుగా ప్రభాస్ పెళ్లి రేపు, ఎల్లుండి అంటూ వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల క్రితం ఆది పురుష్ సినిమాలో జంటగా నటిస్తున్న ప్రభాస్ – కృతి సనన్ డేటింగ్ లో ఉన్నారని కూడా చెప్పుకొచ్చారు. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ కూడా వార్తల వైరల్ అయ్యాయి. అయితే ఈ పుకార్లను కొట్టి పాడేస్తూ తాము స్నేహితులమే అని వరుణ్ ధావన్ కావాలనే అలాంటి కామెంట్లు చేశారు అని కృతి సనన్ కొట్టిపాడేసింది. తర్వాత ఇవి మరుగున పడ్డాయి. అయితే ఇప్పుడు మరోసారి ప్రభాస్ – కృతి పేర్లు తెరపైకి రావడం గమనార్హం.

ఈసారి వారు కలసి న్యూ ఇయర్ వేడుకలను మాల్దీవుల్లో జరుపుకోనున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కొత్త సంవత్సరం వేడుకలు చేసుకోబోతున్నట్లు ఓవర్సీస్ సెన్సార్ బోర్డు మెంబర్, ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశాడు. అయితే ఈ విషయంపై గతంలో కృతి వదిన అంటూ ట్వీట్ లు, సంబరాలు చేసుకున్న ప్రభాస్ అభిమానులు ఈసారి మాత్రం చాలా ఘాటుగా స్పందించారు. ఇంకా పనేమీ లేదా నీకు అంటూ ఉమైర్ ను ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనా ఉమైర్ సందు వల్ల మళ్ళీ ఈ జోడి వార్తల్లో నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news