ఆ విషయంలో మళ్లీ పుంజుకున్న ప్రభాస్.. తగ్గేదేలే అంటూ..?

-

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి.. ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఆయన దానంలో కూడా కర్ణుడిలా గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఇక ప్రజలకు కష్టాలు వస్తే రాజు ఎలా అయితే ఆదుకుంటాడో.. ఇక తనతో ఉండే వారు ఎవరైనా సరే ఆకలితో ఇబ్బంది పడకూడదు అని పుట్టేడు దుఃఖంలో ఉన్నా సరే ప్రజలకు ఆకలి కష్టాలు తీరుస్తూ రాజు అనిపించుకుంటున్నారు. ఇక ఇటీవల వారి ఇంటికి, ఆయన జీవితానికే పెద్దదిక్కుగా ఉన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో ప్రభాస్ జీవితం ఒక్కసారిగా తలకిందులైందని చెప్పవచ్చు.

ఇక పెదనాన్నే ప్రాణంగా జీవిస్తున్న ప్రభాస్ ఇలా ఉన్నట్టుండి పెదనాన్నను కోల్పోవడం ఇండస్ట్రీ కూడా విషాదంలోకి మునిగిపోయింది. ఇక నిన్న కృష్ణంరాజు 11వ దినం కార్యక్రమాలను జూబ్లీహిల్స్ లో ఉన్న ఆయన నివాసంలో పూర్తి చేశారు. ఇక ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు, బంధువులు, సన్నిహితులు హాజరైనట్లు సమాచారం. ఇక్కడ కూడా కొన్ని వేల మందికి భోజన ఏర్పాట్లు చేయించారు. అంతేకాదు మొగల్తూరులో జరగబోయే 28 , 29వ తారీకులలో సంస్కరణ సభకు సుమారుగా కొన్ని లక్షల మంది హాజరవుతున్నట్లు సమాచారం. వీరందరికీ కూడా భోజనం ఏర్పాట్లు చేయిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈనెల విపరీతంగా ప్రభాస్ కి అభిమానులు పెరిగిపోయారని చెప్పవచ్చు. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి.. Omax సంస్థ నిర్వహించిన జాబితాలో నెంబర్ వన్ స్థానాన్ని ప్రభాస్ కైవసం చేసుకున్నారు . ఇక అభిమానుల ఆదరాభిమానాలు పొందడంలో ఆయన తర్వాతే ఎవరైనా అని తెలుస్తోంది. ప్రభాస్ మొదటి స్థానాన్ని కొనసాగుతుండడంతో ఆయన అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం తాను మొదలుపెట్టిన ప్రాజెక్టులకు నెల రోజులపాటు విరామం ఇచ్చిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news