బ్రేకింగ్ : జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ప్రకాష్ రాజ్…!

-

టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. మా ఎన్నికల పోలింగ్ సమయంలో తనపై దాడి జరిగిందని ప్రకాష్ రాజ్ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ప్రకాష్ రాజ్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ద్వారా తనిష్ పై జరిగిన దాడి విషయం సిసి టివి ఫుటేజ్ ద్వారా బయటకు వస్తుందని తాను భావిస్తున్నట్టు ప్రకాష్ రాజ్ వెల్లడించారు. అంతేకాకుండా మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ నుండి ఎలాంటి స్పందన రావడం లేదని… సిసి టివి ఫుటేజ్ కోసం కోర్టుకు వెళ్ళమని ఆయన చెబుతున్నారని ఆరోపిస్తున్నారు.

మా ఎన్నికల పోలింగ్ జరిగిన తీరుపై తమకు అనుమానాలున్నాయని చెబుతున్నారు. ఇక ఇప్పటికే తనీష్ పోలింగ్ జరుగుతున్న సమయంలో మోహన్ బాబు తనను బండ బూతులు తిట్టాడు అంటూ మీడియా ముఖంగా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే మా ఎన్నికలు పూర్తయిన కూడా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిన ప్రకాష్ రాజ్ పోలింగ్ సమయంలో దాడులు జరిగాయని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ప్రకాష్ రాజ్ ప్యానల్ లో గెలిచిన వాళ్ళు తమ పదవులకు రాజీనామా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news