కరెంటు కోతలపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు పరిస్థితులు,కోతలపై సమీక్షించారు సీఎం జగన్. రాష్ట్రంలోకరెంటు పరిస్థితులపై అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి.. బొగ్గు సరఫరా, విద్యుత్‌ కొరత రాకుండా అమలు చేస్తున్న అత్యవసర ప్రణాళికలు, దీర్ఘకాలిక వ్యూహాల పైనా సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చూసుకోవాలని.. సింగరేణి సహా కోల్‌ఇండియా తదితర సంస్థలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు.

బొగ్గు తెప్పించుకునేందుకు సరుకు రవాణా షిప్పుల వినియోగం లాంటి ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని.. దీని వల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తాయని పేర్కొన్నారు. సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.

కావాల్సిన విద్యుత్‌ను సమీకరించుకోవాలని.. తాత్కాలిక చర్యలతో పాటు దీర్ఘకాలిక విద్యుత్‌ ఉత్పత్తి వ్యూహాలపైనా దృష్టి సారించాలన్నారు. 6300 మెగావాట్ల రివర్స్‌ పంపింగ్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టు నిర్మాణం పై తగిన చర్యలు తీసుకోవాలని.. సీలేరులో ప్రతిపాదిత 1350 మెగావాట్ల రివర్స్‌ పంపింగ్‌ ప్రాజెక్టుపైనా దృష్టిపెట్టాలని పేర్కొన్నారు సిఎం జగన్. ఈ ప్రాజెక్టులను సాకారం చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news