వచ్చే ఎన్నికల్లో వైసీపీకి భారీ ఓటమి తప్పదు : ప్రతిపాటి

-

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఏపీని భయానకంగా మార్చేస్తున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. చిలకలూరిపేటలో ప్రత్తిపాటి ఆధ్వర్యంలో టీడీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 7వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకు ఓటమి తప్పదని తేటతెల్లమైంది. పోలీసులను జగన్ తన ప్రైవేట్ సైన్యంగా మార్చుకున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. అధికారాన్ని కోల్పోబోతున్నాడని తెలిసే జగన్ బరితెగించారు. చంద్రబాబు కోసం రోడ్లపైకి రావడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు.చంద్రబాబుపై కుట్రలు ఆపకపోతే ప్రజలే తిరగబడతారని ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు.

chandrababu palnadu tour success : prathipati pulla rao

జనసేన అధినేత పవన్ కల్యాణ్, తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను ఏదో విధంగా ఇబ్బందులకు గురిచేయాలని చూస్తోందన్నారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ… రాష్ట్రంలో కొంతమంది ఉన్నతాధికారులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు మద్దతుగా దేశవిదేశాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయని, మహిళలు, యువత సహా ప్రజలంతా రోడ్ల పైకి వస్తున్నారన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాలను అణిచివేయాలని అధికార పార్టీ చూస్తోందన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news