ఆర్మీ ఆస్పత్రిలో రాష్ట్రపతికి కంటి ఆపరేషన్

-

ఆర్మీ ఆసుపత్రిలో రాష్ట్రపతి ద్రౌపద ముర్ముకు కంటి ఆపరేషన్ నిర్వహించారు. ద్రౌపది ముర్ము కుడి కంటికి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిందని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. గత కొంత కాలంగా ముర్ము.. మెజెస్టి క్యాటరాక్ట్‌తో బాధపడుతున్నారు.

ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే ఆర్మీ ఆస్పత్రిలో బ్రిగేడియర్ ఎస్‌కే మిశ్రా బృందం విజయవంతంగా సర్జరీ చేసిందని రాష్ట్రపతి భవన్ తన ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 16న న్యూ దిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో ఆపరేషన్‌ జరిగిందని తెలిపింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని, విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news