అనంత్ – రాధిక శుభ్ ఆశీర్వాద్ వేడుకకు ప్రధాని మోడీ

-

పలు డెవలప్మెంట్ కార్యక్రమాలను ప్రారంభించేందుకు ముంబైకి వచ్చిన పీఎం నరేంద్ర మోడీ శనివారం రాత్రి 8.30 గంటలకు జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ‘శుభ్ ఆశీర్వాద్’ వేడుకకు హాజరు అయినాడు.అక్కడ ఆయనకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత , ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీ సాదర స్వాగతం పలికారు. అనంతరం తన వెంట ప్రధాని మోడీని ‘శుభ్ ఆశీర్వాద్’ కార్యక్రమ ప్రధాన వేదిక దాకా ముకేశ్ అంబానీ తీసుకెళ్లారు. ఈ వేదికపైకి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ.. వివాహ బంధంతో ఒక్కటైన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ దంపతులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా వారికి ఆయన వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా తమ కోడలు రాధికా మర్చంట్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను పీఎం మోడీకి ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులు పరిచయం చేశారు. బ్రిటన్ మాజీ పీఎం టోనీ బ్లెయిర్ సహా పలువురు విదేశీ ప్రముఖులు అక్కడ మోడీని కలిసి ముచ్చటించారు. తర్వాత ప్రధాని మోడీ అక్కడే డిన్నర్ చేసి బయలుదేరారు.

Read more RELATED
Recommended to you

Latest news