అలీపై కీలక వ్యాఖ్యలు చేసిన పృధ్వీరాజ్

-

పవన్ కళ్యాణ్ దగ్గరికి దూతలా పంపించారని చెప్పడం అంతా పబ్లిసిటీ స్టంట్ అని కొట్టి పడేశారు సినీ నటుడు పృథ్వీరాజ్. కెసిఆర్ కి ఏమన్నా డబ్బులు ఏమైనా ఊరికే దొరుకుతున్నాయా, ఆయన ఎందుకు పంపిస్తాడన్నారు. తనకి కూడా అప్పట్లో 200 కోట్లు పంపించారని ప్రచారం చేశారని.. ఆ డబ్బులు లెక్కేట్టుకోవడానికి ఇన్ని రోజులు పట్టి ఇప్పుడు తిరుమలకి వచ్చానని ఎద్దేవా చేశారు.

నరం లేని నాలుక వంద మాట్లాడుతుందని..టాక్స్ కట్టుకోవడానికే పవన్ కళ్యాణ్ 9 కోట్లు అప్పు చేశాడని తెలిపారు. జనం కోసం పుట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు పృథ్వీరాజ్. అలాంటి వ్యక్తి మీద ఆరోపణలు చేయడం తప్పు అన్నారు. ఆలీ ఎవరు? పవన్ కళ్యాణ్ ఎవరు..?అని.. ఆయన ఎవరో పవన్ కళ్యాణ్ నాతో ఫోటో దిగారని చెప్పాడే అలా ఉంది పవన్ కళ్యాణ్ పై ఆలీ పోటీ అనడం అంటూ ఎద్దేవా చేశారు. స్థాయి చూసుకోవాలి కదా…? అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news