మోదీ జీ.. మీలాంటి నియంత ముందు మేం ఎన్నటికీ తలవంచం : ప్రియాంకా గాంధీ

-

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్‌ తీసుకున్న నిర్ణయంపై ఆయన సోదరి, కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రంగా మండిపడ్డారు. మోదీజీ  అమరవీరుడైన ఓ ప్రధాని కుమారుడిని దేశద్రోహి అంటూ మీ అనునయులు విమర్శించారని గుర్తు చేశారు. బీజేపీ ముఖ్యమంత్రి ఒకరు రాహుల్‌ గాంధీ తండ్రి ఎవరు? అని ప్రశ్నించారని తెలిపారు. కశ్మీరీ పండిట్ల సంప్రదాయాన్ని పాటిస్తూ ఓ కొడుడు తన తండ్రి మరణం తర్వాత తలపాగా ధరిస్తే దాన్నీ రాజకీయం చేశారని వెల్లడించారు.

‘‘నెహ్రూ పేరును ఎందుకు పెట్టుకోలేదని మీరు (మోదీని ఉద్దేశిస్తూ)  ఆ రోజు పార్లమెంట్‌లో ప్రశ్నించారు. అది మా కుటుంబాన్నీ, కశ్మీరీ పండిట్లను కించపర్చడం కాదా? కానీ దీనికి ఏ కోర్టు మీకు రెండేళ్ల జైలు శిక్ష వేయలేదు. అనర్హత వేటు పడలేదు. రాహుల్‌ లాంటి నిజమైన దేశభక్తుడు ఈ కుంభకోణాల గురించి ప్రశ్నించారు. మీ స్నేహితుడు అదానీ.. పార్లమెంట్‌ కంటే గొప్పవాడా? మా కుటుంబాన్ని మీరు పరివార్‌వాదీ అంటూ చులకన చేసి మాట్లాడారు. కానీ, ఇది తెలుసుకోండి..! మా కుటుంబం ఈ దేశ ప్రజాస్వామ్యం కోసం తమ రక్తాన్ని ధారపోసింది. ఆ ప్రజాస్వామ్యాన్ని మీరు ఇప్పుడు నాశనం చేయాలని చూస్తున్నారు. మా కుటుంబం ప్రజల కోసం గళమెత్తింది. తరతరాలుగా నిజం కోసం పోరాడుతోంది. అదే రక్తం మా నరనరాల్లో ప్రవహిస్తోంది. దానికో ప్రత్యేకత ఉంది. మీ లాంటి అధికార దాహం ఉన్నవారు.. నియంతల ముందు మేం ఎన్నడూ తలవంచలేదు.. తలవంచబోం కూడా. మీకు కావాల్సింది చేసుకోండి’’ అంటూ ప్రియాంక తీవ్రంగా మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news