తల్లి కోడి తన పిల్లలను కాపాడినట్టు తెలంగాణను కాపాడా : కేసిఆర్

-

భువనగిరి రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…తల్లి కోడి తన పిల్లలను కాపాడినట్టు తెలంగాణను కాపాడానని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. భువనగిరిలో బస్వాపూర్ ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం.ప్రాజెక్టుల నుంచి పంటలకు నీళ్లు ఇవ్వకుండా పంటలు ఎండబెట్టారు అని మండిపడ్డారు. రైతుబంధు ఇవ్వలేదు… రైతు భీమా ఉంటుందో లేదో. మిలర్ల దగ్గర కమీషన్ దొబ్బారు…రైతులకు మంచి ధరకు కొనుగోలు చేయడం లేదు అని విమర్శించారు.

కాంగ్రెస్ వచ్చాక రాత్రి పూట కరెంట్‌తో రైతులు చనిపోతున్నారు. నాలుగు గంటల్లో రైతు ఆత్మహత్యల వివరాలు పంపించినా పట్టించు కోలేదు” అని కేసిఆర్ అన్నారు. బోనస్ బోగస్ అయింది.తులం బంగారం తుస్సుమన్నది.కాంగ్రెస్ దొంగ హామీలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైర్ అయ్యారు.తెలంగాణ మీది.. భవిష్యత్తు మీది.యువత ఆలోచించి ఓటెయ్యాలి!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరారు.” 1956 నుంచి మనకు శత్రువే కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీతోనే నష్టం” అని కేసీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news