విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడం మా కూటమి లక్ష్యం : పవన్ కళ్యాణ్

-

ఆంధ్ర ప్రదేశ్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ దూసుకెళ్తున్నారు. అధికార వైసీపీ, ముఖ్యమంత్రి జగన్‌పై తనదైన శైలిలో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వారాహి యాత్రలో భాగంగా పవన్ ఆదివారం అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు సాధారణ ప్రజలు సైతం కలిసి రావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

‘ఇది నేను ఒక్కడినే చేసే పని కాదు. ప్రజల భావోద్వేగాలతో కూడుకున్న అంశమిది. అందరూ కలిసి రోడ్లపైకి రావాలి అని పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలు బాగుండాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడం మా కూటమి లక్ష్యం. ఉద్దానం సమస్య తీరేందుకు పోరాడినట్లే దీని కోసం బలంగా నిలబడదాం’ అని ఆయన ఆకాంక్షించారు.ఈ ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చకూడదనడానికి కారణం యువత మహిళలు, పిల్లలేనని పవన్ కళ్యాణ్ అన్నారు. మీ భవిష్యత్ కోసమే దశాబ్దం కాలం పాటు జనసేన పార్టీలో ఒక ఎమ్మెల్యే లేకపోయినా పార్టీని నడిపానని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news