టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు నిరసన సెగ..కారుపై చెప్పులు విసిరిన రైతులు

-

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డికి నిరసన సెగ తగిలింది..యాచారం మండలం మేడిపల్లిలో భారీ వర్షాలకు నిండిన చెరువు దగ్గర పూజలు చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది..గ్రామంలోకి రావద్దు అంటూ ఎమ్మెల్యే కారుపై రైతులు చెప్పులు విసిరి నిరసన తెలిపారు రైతులు..మేడిపల్లి గ్రామం ఫార్మా సిటీలోకి పోతుందని, దీనికి కారణం ఎమ్మెల్యేనేని గ్రామస్తులు ఆగ్రహాం వ్యక్తం చేశారు.. ఎమ్మెల్యే తమ గ్రామంలోకి రావద్దని స్థానికులు ఆందోళనకు దిగారు..ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు..ఫార్మా కంపెనీ వల్ల భూములు కోల్పొతుంటే పట్టించుకోవడం లేదని, పైగా రైతులపైనే బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని రైతులు నిరసన తెలియజేశారు..నిరసకారులపై పోలీసులు లాఠీ చార్జ్‌ చేశారు..పరిస్థితి అదుపుతప్పడంతో ఆందోళనకారులను అదపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు..గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు.

Read more RELATED
Recommended to you

Latest news