తిరుపతిలో హై టెన్షన్.. భారీగా పోలీసులను పిలిపిస్తోన్న టీటీడీ !

-

తిరుపతి శ్రీవారి మెట్టు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గోవింద నామస్మరణతో భక్తులు ఆందోళనకు దిగారు. వందలాది కిలోమీటర్ల పాదయాత్ర గా వచ్చే భక్తులకు దర్శనం లేదని టీటీడీ ముందే ప్రకటించకుండా, ఇప్పుడు తిరుమలకు వెళ్ళనివ్వకపోవడంతో శ్రీవారి మెట్టు వద్ద ధర్నాకు దిగిన  భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ నినాదాలు చేస్తున్నారు.

టీటీడీ పాలకమండలి కి వ్యతిరేఖంగా నినాదాలు చేస్తున్నారు వందల మంది భక్తులు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా భక్తులను అడ్డుకున్నారు అంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలకు వెళ్ళకుండా వెనుదిరిగేది లేదంటూ ధర్నాకి దిగిన భక్తులు చెబుతున్నారు. అనంతపురం, తమిళనాడు, కర్ణాటకలలోని వివిధ జిల్లాల నుంచి  భారీగా కాలి నడకన శ్రీవారి మెట్టు కి చేరుకున్నారు భక్తులు. భక్తులను అదుపు చేసే పరిస్థితి లేనందున భారీగా  పోలీసులను పిలిపిస్తునన్నారు టీటీడీ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news