BREAKING : పుల్లారెడ్డి స్వీట్ షాపునకు రూ.25వేలు జరిమానా

-

పుల్లారెడ్డి స్వీట్ షాపునకు బిగ్‌ షాక్‌ ఇచ్చింది గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌. శంషాబాద్ లో ఉన్నటు వంటి… పుల్లారెడ్డి స్వీట్ హౌస్ లో మిఠాయిలు పాచిపోయి ఉన్నాయి. గత కొన్ని రోజుల నుంచి… శంషాబాద్ లోని పుల్లారెడ్డి స్వీట్ హౌస్ లో మిఠాయిలు పాచిపోయిన వాటినే అమ్ముతున్నారు. అయితే.. ఈ నేపథ్యం లోనే.. పుల్లా రెడ్డి పై ఫిర్యాదు చేశారు స్థానిక కస్టమర్లు. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు.. శంషాబాద్ పుల్లారెడ్డి స్వీట్ హౌస్ కి జరిమానా విధించారు.


కస్టమర్ల ఫిర్యాదు తో… పుల్లారెడ్డి స్వీట్ హౌస్ లో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనీఖీల్లో….మిఠాయిలు పాచిపోయి ఉండటం… అధికారులు గుర్తించారు. దీంతో… శంషాబాద్‌ పుల్లారెడ్డి స్వీట్ హౌస్ పై ఏకంగా.. 25 వేల రూపాయల జరిమానా విధించారు జీహెచ్‌ ఎంసీ అధికారులు. శంషాబాద్ పుల్లారెడ్డి స్వీట్‌ హౌజ్‌ లో పాచిపోయిన మిఠాయిలు లభ్యం కావడంతో… మిగతా షాపుల్లోనూ… జీహెచ్‌ ఎంసీ అధికారులు తనీఖీలు చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news