నాగార్జున సాగర్ వద్ద హల్చల్ చేసిన పీవీ సింధు !

-

నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద అంతర్జాతీయ క్రీడాకారిణి పీవీ సింధు హల్చల్ చేశారు. ప్రాజెక్ట్ వద్ద జల కళ బాగుండటం తో ఆమె తమ కుటుంబ సభ్యులతో సాగర్ చేరుకున్నారు. ప్రాజెక్ట్ వద్ద ఆమె చాలా సేపు ఉల్లాసంగా గడిపారు. ఇక నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. మొత్తం 20 క్రస్టుగేట్ల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. 10 గేట్లు 15 ఫీట్ల మేర, 10 గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.

ఇక ప్రాజెక్ట్ కు ఇం ఫ్లో అలానే ఔట్ ఫ్లో రెండో 4,10,978 క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ : 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ : 312.0450 టీఎంసీలుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం : 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం : 590.00 అడుగులు ఉంది. ఇక సింధు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news