వ్యాపార ప్రయోజనాల కోసమే రాజధాని మళ్లింపు : పీవీఎన్ మాధవ్

-

రాష్ట్ర రాజధాని విషయంలో రెండు పార్టీలు సవాలు విసురుకోవడం సరైన పద్ధతి కాదని బిజెపి శాసన మండలి సభ్యుడు పీవీఎన్ మాధవ్ అన్నారు.. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరుపార్టీలు రాజధాని కోసం….. రాజీకి రావాలని ఆయన సూచించారు. రాజధాని అమరావతికి కోసం రైతులు ప్రభుత్వానికి భూములు ఇచ్చారని… చంద్రబాబునాయుడికి ఇవ్వలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడే… విశాఖ ఆర్ధిక రాజధానిగా అవతరించిందని మాధవ్ అన్నారు. వ్యాపార ప్రయోజనాల కోసమే.. విశాఖను పరిపాలన రాజధాని చేయాలని వైఎస్ఆర్సిపి నేతలు చూస్తున్నారని మండిపడ్డారు.

Pvnudev
Pvn udev

లెబనాన్ పోర్ట్​లో జరిగిన అమ్మోనియం నైట్రేట్ పేలుడు తరహా ప్రమాదం.. విశాఖకు పొంచి ఉందని బిజెపి ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఒక్క విశాఖ పోర్ట్​లో మాత్రమే అమ్మోనియం నైట్రేట్ దిగుమతులు జరుగుతున్నాయని …, ప్రభుత్వ యంత్రాంగం దీనిపై దృష్టి పెట్టాలని కోరారు. ఇప్పటికే వరుస పరిశ్రమ ప్రమాదాలు జరుగుతున్నందున… ముందస్తుగానే భద్రత చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news