క్విట్ చంద్రబాబు – సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ఎన్నికలకు వెళ్తాం: మంత్రి రోజా

-

ఏపీలో రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే పార్టీల నేతలు ప్రజల వద్దకు వెళ్తున్నారు. సభలు, సమావేశాలు, పర్యటనలు చేస్తూ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. తెలుగు దేశం నేత నారా చంద్రబాబు నాయుడు ‘బాదుడే బాదుడు ‘ అంటూ జిల్లాల పర్యటన చేస్తూ వైఎస్ఆర్సీపీ సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ తరుణంలో’ క్విట్ చంద్రబాబు- సేవ్ ఆంధ్రప్రదేశ్’ నినాదంతో 2024 ఎన్నికలకు వెళ్తామని మంత్రి రోజా అన్నారు.

చంద్రబాబు నిన్న కడప లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్, వైసీపీ పాలన పై ఆయన ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై రోజా స్పందిస్తూ.. కుప్పంలో జరిగిన అభివృద్ధి, పులివెందులలో జరిగిన అభివృద్ధికి మధ్య ఉన్న తేడాను గమనించాలని చెప్పారు. చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. 14 ఏళ్ల పాటు సీఎం గా ఉన్నప్పటికీ కుప్పంలో కనీసం రెవెన్యూ డివిజన్ గా కూడా చెయ్యలేని అసమర్ధుడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news